KMM: తల్లాడ మండలం మిట్టపల్లి నుంచి రామనుజవరం వెళ్లే రహదారి భారీ గుంతలు ఏర్పడి కంకర పైకి తేలి ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా రాత్రి సమయాల్లో గుంతలు కనపడక వాహనాదారులు ప్రమాదాలకు గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.