KMM: తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, ప్రముఖ ప్రజాగాయకుడు అందెశ్రీ అకాల మరణం పట్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఆవిర్భావంలో ఆయన రచనలు, గానం కీలక పాత్ర పోషించాయని గుర్తుచేశారు. రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ను అందించిన అందెశ్రీ మరణం సాహితీ లోకానికి తీరని లోటని మంత్రి పేర్కొన్నారు.