HYD: కాచిగూడలోని శ్రీ ఉత్తరాది మఠంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం అంగరంగవైభవంగా ప్రారంభమయ్యా యి. ఉదయం స్వామివారికి అంకురార్పణం, పుణ్యాహవచనంతో ప్రత్యేక పూజలు చేసి, యాగం చేసి బ్రహ్మోత్సవాలను వేద పండితులు ప్రారంభించారు. 6వ తేదీన శుక్రవారం శ్రీ స్వామివారి కళ్యాణం ఉంటుందని జయ తీర్థచార్య తెలిపారు.