NLG: చిట్యాల మండలం ఉరుమడ్ల, అంగన్వాడీ కేంద్రం-2లో శుక్రవారం అన్న ప్రాసన కార్యక్రమాన్ని సర్పంచ్, అంగన్వాడి మానిటరింగ్ కమిటీ ఛైర్మన్ సాగర్ల భానుశ్రీ అంగన్వాడీ టీచర్ లలితతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శిశువు పుట్టినప్పటి నుంచి ఆరు నెలలు వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, ఆ తర్వాత తప్పకుండా అనుబంధ ఆహారం ఇవ్వాలని సూచించారు.