ASF: సిర్పూర్(యు) మండలం కొత్తపల్లి నార్త్ బీట్లో జోడేఘాట్ FRO రమేశ్ సోమవారం గస్తీ నిర్వహించారు. తనిఖీల్లో వన్యప్రాణుల పాదముద్రలను గుర్తించినట్లు తెలిపారు. అడవులను ధ్వంసం చేసినా, మూగజీవాలను వేటాడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అడవిని కాపాడుకోవడం సామాజిక బాధ్యతని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సెక్షన్ అధికారి అనూష, బీట్ అధికారి మహేశ్, పాల్గొన్నారు