BDK: హైదరాబాద్ సింగరేణి భవన్లో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్తో సోమవారం జరిగిన 39వ నిర్మాణాత్మక సమావేశంలో సింగరేణి సీఎండీ ఎన్. బలరామ్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ దిశా నిర్దేశంలో అంతర్జాతీయ సంస్థగా ఎదుగుతున్న సింగరేణికి సుస్థిర భవిష్యత్ అందించడానికి ప్రతీ ఉద్యోగి భాగస్వామి కావాలని వారు కోరారు.