WNP: భారత దేశ తొలి విద్యా శాఖ మంత్రిగా పని చేసి దేశ విద్యా రంగానికి బలమైన పునాదులు వేసిన ఘనత మౌలానా అబుల్ కలాం ఆజాద్కీ దక్కుతుందని కలెక్టర్ ఆదర్శ్ సురభి కొనియాడారు. మంగళవారం మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్ ఆవరణలో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు హాజరై మౌలానా చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు.