PLD: భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ 138వ జయంతి వేడుకలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పాల్గొని, మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు పాల్గొన్నారు.