HYD: ఉగాది, రంజాన్ సెలవుల అనంతరం ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం ప్రయాణికులు తిరిగి హైదరాబాద్కు చేరుకుంటున్నారు. దీంతో జూబ్లీ బస్ స్టేషన్ (JBS), ఎంజీబీఎస్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. అయితే ‘మహాలక్ష్మీ’ పథకం ద్వారా మహిళలకు సాధారణ బస్సుల్లో ఉచిత ప్రయాణం యథావిధిగా కొనసాగుతోంది. రద్దీని దృష్టిలో ఉంచుకుని TGSRTC అదనపు బస్సులను నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.