కామారెడ్డి: చైల్డ్ హుడ్ కేన్సర్ పై అవగాహన కోసం పట్టణంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో హాఫ్ మారథాన్ నిర్వహించనున్నట్లు పద్మపాని సొసైటీ చైర్మన్ సత్య నారాయణ రెడ్డి తెలిపారు. శనివారం ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ.. విద్యా సంస్థల సహకారంతో మార్చి 2న స్టేట్ లెవల్ కామారెడ్డి హాఫ్ మారథాన్ కార్యక్రమం ఉంటుందన్నారు.