KMM: నేలకొండపల్లి గ్రామంలోని కర్నాటి క్రిష్ణయ్య నగర్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం మహిళా సమాఖ్య నాయకులు భాగం సరోజిని, మారిశెట్టి విజయదుర్గ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో ముందుండి అభివృద్ధి సాధించాలని అన్నారు. మహిళలు అందరూ కలిసికట్టుగా ఉంటే సాధించలేనిది ఏమీ లేదు అని పేర్కొన్నారు.