NRPT: మక్తల్ మండలం మంథన్గోడ్లో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కీళ్ల నొప్పులు, పక్షవాతం, బీపీ, షుగర్ వంటి వ్యాధులకు నిపుణులైన డాక్టర్లు పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సర్పంచ్ రాజేందర్ గౌడ్ సమక్షంలో జరిగిన ఈ శిబిరానికి గ్రామస్థులు పెద్ద ఎత్తున హాజరై ఆరోగ్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు.