JGL: ధర్మపురి స్వామివారి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించిన సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావును హైదరాబాద్లోని ఆయన కార్యాలయంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్వామివారి శేష వస్త్రం, ప్రసాదం అందజేసి కమిషనర్ను సన్మానించారు. ఆలయ ఉత్సవాల నిర్వహణపై వివరాలు తెలియజేశారు.