NLG: అనుముల మండలం అనుముల వారి గూడెం గ్రామ రామాలయ ఉత్సవ కమిటీ గ్రామ పెద్దలు బుధవారం ప్రజా నాయకుడు పాండురంగారెడ్డిని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిశారు. సీతారామచంద్ర స్వామి ఆలయ నిర్మాణానికి తోడ్పడాలని కోరగా, పాండురంగారెడ్డి రూ.50 వేల విరాళం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో హాలియా మార్కెట్ డైరెక్టర్ యాదయ్య, మారం శ్రీనివాస్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.