ఖమ్మం: ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఐ పార్టీ కృషి చేస్తుందని ఆ పార్టీ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి ఏపూరి లతా దేవి అన్నారు. ఖమ్మం నగరంలో జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడుతూ.. ఈనెల 26న జరిగే సీపీఐ పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని కోరారు. కార్మికులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ప్రజా సమస్యలపై ఉద్యమించే సీపీఐ పార్టీనే అని అన్నారు.