NGKL: పాలెంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో కిసాన్ మేళా, వ్యవసాయ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ Dr. పీ.శ్రీదేవి తెలిపారు. ఈ నెల 24న ఉదయం 9:30 గంటలకు వ్యవసాయానికి సంబంధించిన అంశాలపై నమూనాల ప్రదర్శన, రైతులు-శాస్త్రవేత్తలకు చర్చా, ఆధునిక వ్యవసాయ యంత్రాల ప్రదర్శన ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి రైతులు తరలిరావాలని పిలుపునిచ్చారు.