ASF: కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భూమి విక్రయం పేరుతో రూ. 17 లక్షలు తీసుకుని మోసం చేసిన రామటెంకి ప్రకాశ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మాలిని గ్రామంలో 5 ఎకరాల భూమి ఉందని లేని భూమిని ఉన్నట్లు నమ్మించాడు. భూమి చూపించాలని అడిగితే బాధితుడిని బెదిరించడంతో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.