అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు జయంతిని ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన ధర్మపాలన, దానగుణం నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ ప్రత్యేకంగా ప్రసంగించారు.