W.G: పెంటపాడు ప్రజాసంఘాల కార్యాలయం వద్ద సోమవారం రైతు సంఘం జిల్లా నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. డీజిల్, పెట్రోల్ కొరత కొద్దిరోజుల నుంచి ఉందని, గత శనివారం, ఆదివారంలో తీవ్ర రూపం దాల్చిందని ఈ కొరత వల్ల ట్రాక్టర్లు, కోత మిషన్లు, లారీ డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా వారు పెట్రోల్, డీజిల్ కొరత నివారించాలిని కోరారు.