ప్రకాశం: టంగుటూరు మండలం బాబూజీ కాలనీ సమీపంలో ఇవాళ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఒరిస్సా నుంచి పాండిచ్చేరికి సిల్వర్ పౌడర్ లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. ప్రమాదం నుంచి డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. డ్రైవర్ నిద్ర మత్తు వల్లే ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు.