కోనసీమ: ప్రభుత్వ కళాశాలల అభివృద్ధికి, ఉన్నత విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన కొత్తపేట విశ్వ కవి వేమన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూ.14.44 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నేటి విద్యార్థులు రేపటి రాష్ట్ర భవిష్యత్తు అని అన్నారు.