WNP: పట్టణంలో ఏర్పాటు చేసిన “బచ్ పన్” పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి పాల్గొని పాఠశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులకు విలువలతో కూడిన చదువు, సంస్కారం, తల్లిదండ్రులపై భక్తిశ్రద్ధలు ఉండేలా విద్యాబోధన చేయాలన్నారు. క్రీడల్లోనూ విద్యార్థులను రాణించేలా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.