యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి సీనియర్ కబడ్డీ సెలక్షన్స్ డిసెంబర్ 18న ఆత్మకూరు జెడ్పీహెచ్ఎస్లో జరుగుతాయని జిల్లా మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు పూర్ణచందర్ రాజ్ తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు 18వ తేదీ ఉదయం 9 గంటలకు ఆధార్ కార్డుతో పీఈటీ ఇందిరకి రిపోర్ట్ చేయాలని సూచించారు. ఎంపికైన జట్టు డిసెంబర్ 25న ఖమ్మంలో ఆడునుందని పేర్కొన్నారు.