ముఖ్యమైన పనులు చేసేటప్పుడు నలుగురి సలహాలు తీసుకోకూడదని విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పారు. వివేకం లేని అల్పబుద్ధి కలవాడు, బాధ్యత లేని సోమరి, పనులను సాగదీసే దీర్ఘసూత్రుడు, కేవలం సంతోషపెట్టడానికే అబద్ధాలు చెప్పే ముఖస్తుతి పరుడు.. వీరి వల్ల పనులు పూర్తికాకపోగా అనర్థాలు జరుగుతాయని తెలిపారు. సరైన నిర్ణయం తీసుకోవాలంటే ఇలాంటి వారికి దూరంగా ఉండటమే శ్రేయస్కరం అని విదుర నీతి సారాంశం.