SDPT: సిద్దిపేట పట్టణంలోని కోటిలింగాల, శ్రీనగర్ కాలనీల పరిధిలోని 11 కేవీ ఫీడర్లో నిర్వహణ పనుల దృష్ట్యా మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుందని ఏడీఈ సుధాకర్ రెడ్డి తెలిపారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మారుతి నగర్, నీలకంఠేశ్వర ఆలయం, సాయి నగర్, శ్రీనగర్, భారత్ నగర్, శివం టెంపుల్ ప్రాంతాల్లో సరఫరా ఉండదని పేర్కొన్నారు.