KNR: మానకొండూరు మండలం ఈదులగట్టెపల్లి వద్ద ఫోర్ లైన్ రోడ్డు నిర్మాణ పనులను సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వీస్ రోడ్డు నిర్మించే అంశంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సర్వీస్ రోడ్డు నిర్మించే అంశంపై సాధ్యా సాధ్యాలపై అధ్యయనం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.