WGL: వర్ధన్నపేట మండలం కట్ర్యాల చెందిన బీజేపీ నేత జడ సతీష్ ఇటివల గుండెపోటుతో మరణించడంతో గురువారం బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ వారి కుటుంబాన్ని పరామర్శించారు. సతీష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకు ధైర్యం, సానుభూతి తెలియజేశారు. బీజేపీ కోసం అహర్నిశలు కృషిచేసిన వ్యక్తి కాబట్టి వారి లోటు ఎల్లవేళలా తీర్చలేనిదని అన్నారు.