ADB: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని SP అఖిల్ మహాజన్ తెలిపారు. గురువారం పట్టణంలోని జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయంలో ఖాకీ కిడ్స్ ద్వారా సైబర్ క్రైమ్, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. జిల్లాలో గంజాయి లేకుండా, మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని SP అఖిల్ మహాజన్ సూచించారు.