SRCL: తండ్రి మృతి చెందినా పది పరీక్షకు హాజరయ్యాడు ఓ విద్యార్థి. ఎల్లారెడ్డిపేటలో బీజేపీ నాయకుడు చందుపట్ల రాజిరెడ్డి గుండెపోటుతో బుధవారం మరణించాడు. అతని కుమారుడు అక్షిత్ రెడ్డికి పదవ తరగతి పరీక్ష ఉండటంతో బుధవారం పుట్టెడు దుఃఖంలోనూ పరీక్ష కేంద్రానికి వెళ్లాడు. పరీక్ష ప్యాడ్ తీసుకొని పరీక్ష కేంద్రానికి వెళుతున్న అక్షిత్ రెడ్డిని చూసి కుటుంబ సభ్యులు తీవ్రంగా రోదించారు.