KNR: గంగాధర మండల కేంద్రంలో వరి పంట పొలాలను సోమవారం మండల వ్యవసాయ అధికారి ఆర్.శ్రీనివాస్ పరిశీలించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వరి పంటకు అగ్గి తెగులు సోకే అవకాశం ఉంటుందన్నారు. రైతులందరూ ముందు జాగ్రత్తగా ఐసొప్రోత్రయోలిన్ 1.5ml /లీటర్ నీటికి లేదా కాసుగా మైసిన్ 2ml/లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలని సూచించారు.