NZB: రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ దాడులకు పాల్పడడం అత్యంత హేయమైన చర్య అని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ అన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి నివాసంపై కాంగ్రెస్ నేతలు దాడి చేసిన నేపథ్యంలో ధన్పాల్ సోమవారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఇలాంటి ఘటనలు పునరావృతంకాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.