MBNR: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సౌందర రాజన్ మృతి ఆధ్యాత్మిక రంగానికి తీరని లోటని ఎంపీ డీకే అరుణ సంతాపం వ్యక్తం చేశారు. ఉస్మానియా వర్సిటీ అధ్యాపకులుగా, రిజిస్ట్రార్గా ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. చిలుకూరు స్వామివారి సేవలో విశేష గుర్తింపు పొందిన ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.