ASF: సింగరేణి పరిరక్షణ కోసం శనివారం నిర్వహించనున్న ‘సేవ్ సింగరేణి’ జాతా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని AITUC గోలేటి బ్రాంచ్ కార్యదర్శి తిరుపతి పిలుపునిచ్చారు. రెబ్బెన మండలం గోలేటిలో శుక్రవారం మాట్లాడారు. ఈ జాతా గోలేటిలో ప్రారంభమై కొత్తగూడెంలో ముగుస్తుందని తెలిపారు. కార్మికుల హక్కుల రక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన కోరారు.