MDK: శివంపేట మండలం గుండ్లపల్లిలో పదేళ్ల క్రితం దెబ్బతిన్న బోర్లకు సర్పంచ్ పెంజర్ల మమత నర్సింహ యాదవ్ మరమతులు చేయించారు. తాటి కిష్టయ్య, తాడేపు అంజయ్య ఇళ్ల వద్ద పదేళ్ల క్రితం ఇరుక్కుపోయిన బోర్లను బయటకు తీశారు. నూతనంగా మోటర్లు ఏర్పాటు చేసి, ప్రారంభించారు. వేసవి దృష్ట్యా నూతన మోటర్లు ఏర్పాటు చేసి నీరు అందించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.