MHBD: మరిపెడ మండలం నీలికుర్తి శివారు భజన తండాలో రైతులు వ్యవసాయ భూములకు వెళ్లే దారిని సత్తిరెడ్డి అనే భూస్వామి అక్రమించారని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దారికి అడ్డంగా కందకం తవ్వి రైతుల రాకపోకలను నిలిపివేశారని ఆరోపించారు. దీంతో రైతులు వ్యవసాయ భూములకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. వెంటనే అధికారం స్పందించాలన్నారు.