SRCL: కాలువ పనులు పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. ఇల్లందకుంట మండలం పెద్దలింగాపూర్లో అసంపూర్తిగా ఉన్న 11/6 కాలువ పనులను వెంటనే పూర్తి చేయాలని కోరుతూ, రైతులు చేపట్టిన దీక్షకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న మద్దతు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.