MNCL: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా సోమవారం మంచిర్యాలలో నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి సభవిజయవంతం చేయడం పట్ల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు హర్షం వ్యక్తం చేశారు. సభకు పెద్దసంఖ్యలో హాజరైన పట్టభద్రుల ఓటర్లకు, కాంగ్రెస్ శ్రేణులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 27న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు.