KMR: బాన్సువాడ మండలం బోర్లంలో గ్రామ యువకుల ఆధ్వర్యంలో పుల్వామా దాడిలో వీరమరణం పొందిన సైనికులకు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ జై జవాన్ అంటూ గ్రామ వీధులలో తిరిగి అంబేద్కర్ విగ్రహం, గాంధీ చౌక్ వద్ద కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు పాల్గొన్నారు.