ASF: పెంచికల్ పేట్ మండలంలో జరిగిన ఆదివాసీ యువతి సమ్మక్క హత్య కేసుపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోయ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్నయ్య, బాధితురాలి కుటుంబ సభ్యులు రాష్ట్ర SC,ST కమిషన్ ఛైర్మన్ వెంకటయ్యకు ఫిర్యాదు చేశారు. హత్య కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని వెంకటయ్య అన్నారు.