NLG: జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ విద్యార్థులు పరీక్షల సమయంలో భయాందోళనలకు గురికాకుండా, ఆత్మవిశ్వాసంతో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. గురువారం తిప్పర్తి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పదో తరగతి గదిలో విద్యార్థినుల ధైర్యాన్ని అభినందిస్తూ వారిని ప్రోత్సహించారు.