MLG: జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి తెలిపారు. వెంకటాపురం మండలం చిరుతపల్లి పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. విద్యార్థులంతా హాజరై పరీక్షలు రాస్తున్నారని చెప్పారు. తదుపరి పరీక్షలకు సిద్ధంగా ఉండాలని సూచించారు.