KMR: పేద కుటుంబాల సొంతింటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇండ్లు వరం లాంటివని చింతామణిపల్లి సర్పంచ్ సిద్ధిరాములు అన్నారు. బుధవారం గ్రామంలో పలు ఇందిరమ్మ ఇళ్లను ఆయన ప్రారంభించారు. గ్రామంలో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నామని, లబ్ధిదారులు సకాలంలో పనులు పూర్తి చేసుకోవాలని సూచించారు. పేద ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడు పనిచేస్తుందని అన్నారు.