PDPL: రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో రూ.75 లక్షలతో నిర్మించిన తహసీల్దార్ కార్యాలయాన్ని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావుతో కలిసి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రెవెన్యూ గ్రామాలను క్లస్టర్గా విభజించినట్లు తెలిపారు.