MDCL: మీడియా ప్రజల గొంతుకగా నిలవాలని తెలంగాణ హ్యూమన్ రైట్స్ జస్టిస్ ఫోరం ఛైర్ పర్సన్ డా.వ్యాసభట్ శ్రీవాణి చౌదరి అన్నారు. ఉప్పల్ ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా క్లబ్ నూతన కమిటీ సభ్యులను సన్మానించి అభినందించారు. ప్రజా సమస్యలను నిష్పక్షపాతంగా వెలుగులోకి తీసుకురావాలని సూచించారు. ఉప్పల్ అభివృద్ధికి మీడియా నిర్మాణాత్మక సహకారం అవసరమని పేర్కొన్నారు.