ADB: తలమడుగు మండలంలోని పల్సి (బి) తాండ గ్రామానికి చెందిన రాథోడ్ నరేందర్ భార్య అశ్విని ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న బోథ్ MLA అనిల్ జాదవ్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వీరి వెంట మండల BRS నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.