SDPT: భూంపల్లి-అక్బర్పేట్ మండలం ఖాజీపూర్లో శ్రీ మల్లన్న కళ్యాణ మహోత్సవం జరిగింది. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. ఆలయ నిర్వాహకులను అభినందించి, గ్రామస్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.