PDPL: ఎలిగేడు మండలం ర్యాకల్ దేవ్పల్లిలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి గురువారం ఎమ్మెల్యే విజయరమణారావు రూ.20 లక్షల నిధులతో శంకుస్థాపన చేశారు.అనంతరం రూ.5 లక్షలతో అంగన్వాడీ భవనాన్ని పునరుద్ధరించి ప్రారంభించారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. గ్రామాభివృద్ధి పనుల్లో ప్రజలు భాగస్వాములు కావాలని,నాణ్యత ప్రమాణాలు పాటించేలా చూడాలన్నారు.