జగిత్యాల ఓల్డ్ బస్ స్టాండ్ వద్ద “Arrive Alive” కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్, మొబైల్ వినియోగం వల్లే ప్రమాదాలు పెరుగుతున్నాయని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ప్రతి ఒక్కరూ డిఫెన్సివ్ డ్రైవింగ్ అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు నిర్వహించిన యమధర్మరాజు నాటిక ఆకట్టుకుంది.