RR: మహేశ్వరం మండలం సర్దార్నగర్లోని రావిర్యాల పెద్ద చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ను వెంటనే నిర్ధారించాలని అక్కడి ప్లాట్ల యజమానులు హైడ్రా ప్రజావాణిలో కమిషనర్ ఏవీ రంగనాథ్ను కోరారు. ప్రతి ఏటా చెరువు నిండి ఎగువన ఉన్న లే ఔట్లను ముంచేస్తుందని, వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.