ఆదిలాబాద్: దళిత బస్తీ పలువురు లబ్ధిదారులకు రూ. 3 లక్షల విలువ గల సీఆర్ఐ మోటార్స్ పంప్స్, స్టార్టర్ బోర్డు పరికరాలను బుధవారం తాంసి మండలం పొన్నారి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు అందజేశారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదేశాల మేరకు పంపిణీ చేసినట్లు మాజీ వైస్ ఎంపీపీ మచ్చ రేఖ రఘు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నిరుపేద దళితులకు మూడెకరాల భూమి అందించడం జరిగిందన్నారు.